ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 19 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకొనే వారు ఒక్కో పేపర్కు రూ.300 చొప్పున చెల్లించి ఈ నెల 23లోగా, రూ.200 అపరాధ రుసుముతో 25లోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. జవాబు పత్రం నకలు పొందగోరేవారు ఒక్కో పేపర్కు రూ.1000 చొప్పున చెల్లించి 25లోగా తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
ఎండీహెచ్ఎం పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎండీహెచ్ఎం) పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు తెలిపారు. రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 27లోగా, రూ.300 అపరాధ రుసుముతో వచ్చే నెల 2లోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. డిసెంబర్ 16నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఏ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచారు.