నారాయణఖేడ్, సెప్టెంబర్ 28: గడిచిన తొమ్మిదేండ్లలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి రూ.200కోట్లు వెచ్చించామని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి తెలిపారు. గురువారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డితో కలిసి మాట్లాడారు. ఇప్పటికే తండాలకు రూ.112 కోట్లతో బీటీ రోడ్లు ఏర్పాటు చేయగా, మిగతా తండాల కోసం మరో రూ.33.77 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నారాయణఖేడ్, నిజాంపేట్ మండలాల్లో నారాయణఖేడ్ నుంచి కాంజీపూర్ వరకు రూ.1.84 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కొండాపూర్ పంచాయతీ మిట్యానాయక్ తండా వరకు రూ.32 లక్షలు, 161 బీ జాతీయ రహదారి నుంచి మున్యానాయక్ తండా వరకు రూ.80 లక్షలు, 161 బీ జాతీయ రహదారి నుంచి నమ్లిమెట్ నాయక్ తండా వరకు రూ.64 లక్షలు, 161 బీ జాతీయ రహదారి నుంచి తుక్యానాయక్ తండా వరకు రూ.40 లక్షలు, 161 బీ జాతీయ రహదారి నుంచి మాణిక్నాయక్ తండా వరకు రూ.16 లక్షలు, 161 జాతీయ రహదారి నుంచి బుగ్యానాయక్ తండా వరకు రూ.80 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పసులోని గడ్డం తండా వరకు రూ.64 లక్షలు, రాంధన్ తండా నుంచి జైరాం తండా వరకు రూ.56 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
కంగ్టి మండలంలోని పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రాంతీర్థ్ భోజా తండా వరకు రూ.1.20 కోట్లు, కంగ్టి నుంచి వాచుతండా వరకు రూ.1.68 కోట్లు, ముకుంద తండా నుంచి ధర్మనాయక్ తండా వరకు రూ.80 లక్షలు, సిద్ధంగిర్గ నుంచి తుకారాం తండా వరకు రూ.40 లక్షలు, సాధు తండా నుంచి సుక్కల్తీర్థ్ తండా వరకు రూ.కోటి మంజూరు అయ్యాయని వివరించారు. నాగల్గిద్ద మండలంలో గంగారాం తండా నుంచి లక్యానాయక్ తండా వరకు రూ.1.60 కోట్లు, ఇరక్పల్లి నుంచి శ్యామానాయక్ తండా వరకు రూ.1.44 కోట్లు, పత్తునాయక్ తండా నుంచి సాధుశంకర్ తండా వరకు రూ.1.60 కోట్లు, ఎనక్పల్లి నుంచి కొండ్యానాయక్ తండా వరకు రూ.1.60 కోట్లు, ఉట్పల్లి నుంచి పత్తుతండా వరకు రూ.1.10 కోట్లు, సిర్గాపూర్ మండలంలో కిషన్ తండా నుంచి వాలునాయక్ తండా వరకు రూ.64 లక్షలు, శ్యామానాయక్ తండా నుంచి రూప్లా తండా వరకు రూ.2 కోట్లు, వంగ్దాల్ నుంచి గైరాన్ తండా మధ్య హైలెవెల్ బ్రిడ్జికి రూ.82 లక్షలు, సర్పంచ్ తండా నుంచి మంగల్ తండా వరకు రూ.64 లక్షలు, దిద్యా తండా నుంచి లంగర్ తండా వరకు రూ.80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. పెద్దశంకరంపేట మంలంలో కె.వెంకటాపూర్ నుంచి తుమ్మలకుచ్చ తండా వరకు రూ.1.53 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మీది తండా వరకు రూ.80 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మల్కాపూర్ గట్టు కింది తండా వరకు రూ.80 లక్షలు, బుర్గుపల్లి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఇసుకపాయ తండా వరకు రూ.
2 కోట్లు, 161 జాతీయ రహదారి నుంచి దరావత్ తండా వరకు రూ.1.52 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన మేరకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలోని వందశాతం తండాలకు బీటీ రోడ్లు సదుపాయం కలుగుతుందన్నారు. నియోజకవర్గంలో 54 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఆయా తండాలో మౌలిక వసతుల కల్పన, పంచాయతీ భవన నిర్మాణాలకు మరో రూ.50 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతి, తండాల అభివృద్ధిని కాంక్షించి చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే కొంతమంది కాంగ్రెస్ తొత్తులు గిరిజన సంఘాల ముసుగులో అసత్య ప్రచారం చేస్తూ గిరిజనులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. భోగ్భండార్ ఇతర కార్యక్రమాల పేరిట తండాల్లో పర్యటిస్తూ తండావాసులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకులు పలు తండాలకు రోడ్డు వేసేందుకు కాంట్రాక్టు తీసుకుని రోడ్డు వేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే ఉద్దేశంతో మూడేండ్లపాటు జాప్యం చేస్తే తాను వారి కాంట్రాక్టును రద్దు చేయించినట్లు పేర్కొన్నారు. తాము తండాలను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని గిరిజనులు గమనించాలని సూచించారు.
తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.33.77 కోట్లు మంజూరైన నేపథ్యంలో నాగల్గిద్ద జడ్పీటీసీ రాజురాథోడ్ ఆధ్వర్యంలో గిరిజనులు సేవాలాల్ మహరాజ్, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్నాయక్, రమేశ్చౌహాన్, రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.