బెల్లంపల్లిరూరల్, మార్చి18: చదువులో వెనుబడ్డ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సంక్షేమ గురుకులాల ప్రాంతీయ అధికారి కొప్పుల స్వరూపారాణి ఆదేశించారు. బెల్లంపల్లి సీవోఈ లో పదో తరగతి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఉపాధ్యాయులు పలు సూచనలు చేశారు. వార్షిక షెడ్యూల్లో వచ్చిన మార్పులకనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చి దిద్దాలన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలపై ఎస్సీఆర్టీ విడుదల చేసిన పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు బోధించాలని సూచించారు. రీజియన్ పరిధిలోని 17 గురుకులాలకు సంబంధించిన ఉపాధ్యాయులు అంశాల వారీగా ఇప్పటి వరకు జరిగిన పరీక్షలపై సబ్జెక్టు నిపుణులతో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్సీవో కోటిచింతల మహేశ్వర్రావు, ఆదిలాబాద్ డీసీవో శ్రీనివాస్, ఆసిఫాబాద్, మంచిర్యాల డీసీవో బాలభాస్కర్, ఆదిలాబాద్ రీజియన్ లోని గురుకులాల ప్రిన్సిపాళ్లు ఐనాల సైదులు , సువర్ణ లత, లలితాకుమారి, ఎస్.స్వరూప, రాజమణి, మోహన్, వీ సంతోష్, సబ్జెక్టు నిపుణులు దూలం ఎల్లయ్య, సింగతి ఉపేందర్, కోట రాజ్కుమార్, వరమణి ప్రమోద్కుమార్ పాల్గొన్నారు.