పాట్నా : బిహార్లోని సహర్సా జిల్లాలోని సిమ్రీ బక్తియార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిడుగుపాటుకు ఐదుగురు మృత్యువాతపడ్డారు. సోమవారం వర్షం కురిసే సమయంలో కొంత మంది పిల్లలు చంకా గ్రామంలోని పండ్ల తోటలో పండ్లు తీస్తున్నారని పోలీసులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో చెట్టు కింద ఆశ్రయం పొందారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో పిడుగుపడడంతో నలుగురు పిల్లలతో సహా ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మనీషా కుమారి, సంజన కుమారి, కైలాష్ కుమార్, 75 ఏళ్ల మహిళ భదయ్య దేవిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో ఇద్దరు పిల్లల వివరాలు తెలియరాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం.. రూ.4లక్షల పరిహారం అందజేయనున్నట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్డీఓ) వీరేంద్రకుమార్ పేర్కొన్నారు.
29.06.2021, మంగళవారం.. మీ రాశిఫలాలు
స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ.. క్యాన్సర్స్ ముందు జాగ్రత్తలు