హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ విద్యానగర్కు చెందిన అహ్మద్ అబ్దుల్ రషీద్, గర్భిణి అయిన అతడి భార్య ఖాన్స, మూడేండ్ల కూతురు మరియంతో పాటు రాజస్థాన్కు చెందిన ముగ్గురితో కలిసి మక్కా దర్శనానికి కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అబ్దుల్ రషీద్ మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు.