న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని ఎయిమ్స్లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటలకు దవాఖానలోని ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఈ సంఘటన జరిగింది. వెంటిలేటర్లతో ఉన్న రోగులను క్షేమంగా మరో విభాగానికి తరలించారు. 12 రోజుల్లో ఇది రెండో అగ్నిప్రమాదం. ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్ స్టోర్ గదిలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న 7 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పలువురిని దవాఖాన బయటకు తీసుకెళ్లారు. వెంటిలేటర్లపై ఉన్న వారిని క్షేమంగా మరో విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బయటకు తీసుకెళ్లిన రోగులకు వైద్యులు చికిత్స చేస్తూనే ఉన్నారు.
ఢిల్లీ ఎయిమ్స్లో 12 రోజుల వ్యవధిలో అగ్నిప్రమాదం జరుగడం ఇది రెండోసారి. జూన్ 16 న 9 వ అంతస్తులో రాత్రి 10:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. 22 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. ఈ సంఘటనలో కూడా ఎటువంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. రిఫ్రిజిరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కన్వర్జెన్స్ బ్లాక్లో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు.
చరిత్రలో ఈరోజు : లంగూర్ నుంచి మనిషికి తొలి కాలేయ మార్పిడి
కార్లలో ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరి గడువు పొడగింపు
టోక్యో ఒలింపిక్స్ ఆడటం లేదు: సెరెనా విలియమ్స్
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..