లంగూర్గా పిలుచుకునే పొడవైన తోక గల అర్బోరియల్ ఆసియా కోతి నుంచి మనిషికి తొలిసారిగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిపి నేటికి సరిగ్గా 29 సంవత్సరాలు పూర్తయ్యాయి. సర్జరీ అనంతరం సదరు వ్యక్తి 70 రోజుల పాటు బతికి ఉన్నాడు. దీని తర్వాత మరోసారి లంగూర్ నుంచి కాలేయ మార్పిడి జరుపగా కేవలం 26 రోజుల వ్యవధిలో ఆ రోగి చనిపోయాడు. దీనికన్నా ముందు జంతువుల నుంచి మనుషులకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. అయితే, లంగూర్ నుంచి మనిషికి కాలేయ మార్పిడి మాత్రం 1992 జూన్ 28 న జరిగింది.
అమెరికాకు చెందిన 34 ఏండ్ల థామస్ (అసలు పేరు కాదు) హెపటైటిస్ బీ, ఎయిడ్స్తో బాధపడుతున్నాడు. ఇదే సమయంలో థామస్కు ప్రమాదం జరుగడంతో ప్లీహం దెబ్బతిన్నది. దాంతో ప్లీహంను వైద్యులు తొలగించారు. కాలేయ మార్పిడి చేయించుకోవాలని థామస్కు వైద్యులు సలహా ఇచ్చారు. అయితే, థామస్ చాలా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నందున కాలేయ మార్పిడి తలనొప్పిగా మారింది. కామెర్లు, కాలేయ సమస్యలు, హెపటైటిస్, ఎయిడ్స్ కారణంగా అతడి పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్నది. చివరికి పిట్స్బర్గ్ డాక్టర్ థామస్ స్టార్జ్ల్, డాక్టర్ జాన్ ఫంగ్.. కాలేయ మార్పిడి చేయడానికి అంగీకరించారు. ఈ ఇద్దరు వైద్యులు థామస్కు లంగూర్ కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించారు.
హెచ్ఐవీ వైరస్ లాంగర్ల కాలేయంపై ఎలాంటి ప్రభావం చూపదని పరిశోధనల్లో తేలడంతో టెక్సాస్లోని సౌత్వెస్ట్ ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి 15 ఏండ్ల వయసున్న లంగూర్ను తీసుకువచ్చి విజయవంతంగా కాలేయాన్ని థామస్ శరీరంలోకి మార్పిడి చేశారు. ఈ సంక్లిష్టమైన ఆపరేషన్ చేసిన నెల రోజుల తర్వాత కోలుకున్న థామస్ను దవాఖాన నుంచి డిశ్చార్జ్ చేశారు.
అయితే, 21 రోజుల తర్వాత మళ్లీ థామస్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించడంతో తిరిగి దవాఖానలో చేర్చారు. ఈసారి మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. డయాలిసిస్ మొదలెట్టిన తర్వాత ఇన్ఫెక్షన్ పెరిగిపోయి బ్రెయిన్ హామరేజ్ వచ్చి థామస్ చనిపోయాడు. లంగూర్ నుంచి కాలేయాన్ని మార్పిడి చేసిన 70 రోజులకు ఆయన కన్నూమూయడం వైద్య చరిత్రలో ఒక ప్రత్యేక విషయంగా చెప్పుకుంటు ఉంటారు.
2012: మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ జైలులో ఉన్న సుర్జిత్ సింగ్ను భారత్కు అప్పగించిన పాకిస్తాన్
2009: భారతదేశంలోని వివిధ నగరాల్లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ గే ప్రైడ్ పరేడ్ నిర్వహణ
1926: గాట్లీబ్ డైమ్లెర్, కార్ల్ బెంజ్ రెండు సంస్థలను విలీనం చేసి మెర్సిడెస్ బెంజ్ ఏర్పాటు
1921: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జననం
1894: సెప్టెంబర్ మొదటి సోమవారంను కార్మిక దినోత్సవంగా ప్రకటించిన అమెరికన్ కాంగ్రెస్
1846: సాక్సోఫోన్ వాయిద్యానికి పేటెంట్ పొందిన అడాల్ఫ్ సాచ్స్
1838: విక్టోరియా రాణి పట్టాభిషేకం
1965: ఉపగ్రహం నుంచి మొదటి వాణిజ్య ఫోన్ కాల్
కార్లలో ఎయిర్బ్యాగ్స్ తప్పనిసరి గడువు పొడగింపు
టోక్యో ఒలింపిక్స్ ఆడటం లేదు: సెరెనా విలియమ్స్
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..