భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని నగరంలోని పాటిదార్ ప్రైవేట్ దవాఖానలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం దవాఖాన మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయి.
క్షణాల్లో రెండో అంతస్తుకు వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది రోగులను హుటాహుటిన సమీపంలో మరో ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అదనపు ఎస్పీ అమరేంద్ర సింగ్ తెలిపారు. భవనంలో దట్టంగా పొగలు అలుముకోవడంతో కొందరు రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ దవాఖానలో కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
షార్ట్సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి