కేపీహెచ్బీ కాలనీ, జనవరి 31: కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని నిజాంపేట రోడ్డులో ఉన్న హోలిస్టిక్ దవాఖానలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. రాత్రి పదకొండున్నర ప్రాంతంలో సెల్లార్ నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకొన్న ఫైర్ స్టేషన్ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. దవాఖానలో 30 మందికి పైగా రోగులను సమీప దవాఖానలకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.