తుంగతుర్తి, ఆగస్టు 25 : తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కాసర్ల మల్లీశ్వరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో మంగళవారం ఆ గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆర్థిక సహాయం సేకరించి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి నవీన్, అయోధ్య, నగేష్, కరుణాకర్, సుధాకర్, కాసర్ల నరేశ్, మనోహర్, ఇరుగు వేణు, పండల మహేశ్, రాజబోయినా రాజేష్, రవీందర్, దిలీప్, గోపి పాల్గొన్నారు.