న్యూఢిల్లీ, అక్టోబర్ 29: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది మార్చిలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో సమావేశమైన ఈపీఎఫ్వో అత్యున్నత నిర్ణాయక సంఘం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 2020-21కి పీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీరేటును ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దానికిప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని సదరు వర్గాల సమాచారం. త్వరలోనే ఈ వడ్డీరేటు ప్రయోజనం పీఎఫ్ ఖాతాల్లో జమ కానున్నదని చెప్తున్నారు. కాగా, 2019-20లోనూ పీఎఫ్ ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీరేటునే ఇచ్చారు.
ఇది ఏడేండ్ల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.