ఐదవరోజు శనివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఉదయం మృత్యుంజయ, రుద్ర, చండీపారాయణాలతోపాటు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు.
సాయంత్రం భ్రామరి సమేత మల్లిఖార్జునుడు రావణ వాహనంపై ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
కళాకారుల డప్పు చప్పుళ్ల మధ్య గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది.
రావణ వాహనంపై ఉన్న ఆదిదంపతులను దర్శించుకోవడంతో తమ కష్టాలను తొలగించి స్వామి అమ్మవార్లు కాపాడుతారని భక్తులు విశ్వసిస్తారు.
ఉభయ దేవాలయాల్లో షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చినట్లు చెప్పారు.