న్యూఢిల్లీ: గ్యాస్ లభ్యత తగ్గడంతో పలు వాణిజ్య యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్నది. దీంతో తమ సామర్థ్యంలో 60 శాతాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. దక్షిణాదిలోని ఎరువుల తయారీ ప్లాంట్లు మాత్రం ప్రస్తుతానికి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే యూరియా లభ్యతపై తీవ్ర ప్రభావం పడి కొరత ఏర్పడే అవకాశముంది.
గ్యాస్ ఎనర్జీ ధరలు పెరిగితే ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి. తద్వారా ఎరువుల ధరలు కూడా భారీగా పెరగవచ్చు. ఇప్పటికే గత నెల రోజుల వ్యవధిలో అంతర్జాతీయంగా యూరియా ధర 25 శాతం పెరిగి టన్ను 600 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం లభ్యమవుతున్న గ్యాస్ వనరులను ఉపయోగించుకుని గరిష్ఠంగా ఎరువులను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని పలు కంపెనీలు తెలిపాయి.