కన్నాయిగూడెం, మే 10 : గోదావరి నదిలో ఈతకు వెళ్లిన మామ, అల్లుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలోపురానికి చెందిన వార్డు సభ్యుడు బొమ్మరాజు నరేశ్ (30), రొయ్యూరుకు చెందిన ఇతడి సోదరి కుమారుడు జిట్ట విష్ణువర్ధన్(18) ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో స్థానికుడు సంపత్తో కలిసి సమీపంలోని గోదావరి నదికి వెళ్లారు. విష్ణువర్ధన్ ఈత నేర్చుకుంటానని మామ నరేశ్తో చెప్పగా ట్రాక్టర్ ట్యూబ్లో గాలి నింపుకొని ఈదుతుండగా ట్యూబ్ జారిపోయింది.
ఈ క్రమంలో విష్ణువర్ధన్ను కాపాడేందుకు నరేశ్ తీవ్రంగా యత్నించి ఇద్దరూ నదిలో మునిగిపోయారు. నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో సంపత్ బయటకు వచ్చి గల్లంతైన వారి కోసం స్థానికులతో కలిసి గాలించారు. నరేశ్, విష్ణువర్ధన్ మృతదేహాలు కనిపించడంతో స్థానికంగా విషాదం నెలకొన్నది.