హైదరాబాద్ : ఆ తండ్రి, కూతురికి ఏ కష్టమొచ్చిందో తెలియదు పాపం. ఇకపై జీవించడం వృథా అని భావించారు. పురుగుల మందు(Pesticides) తాగి తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగగా తండ్రి మృతి(Father died) చెందాడు. కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్కు తరలించారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా( Hanumakonda) నడికుడ మండలం రామకృష్ణాపురంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.