Farmers Protest | రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్లో ఏడు జిల్లాల్లో సోమవారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 26 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. తాజా ఉత్తర్వులతో 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రభావితం కానున్నది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1985లోని సెక్షన్ 7 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వును జారీ చేసింది.
అంతకుముందు, ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రైతు సంఘాలు పంజాబ్లోని అనేక జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత సమస్యలను లేవనెత్తారు. వెంటనే అమలులోకి వచ్చేలా సేవలను పునరుద్ధరించాలని భగవంత్ మన్ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలోనే ఈ అంశాన్ని లేవనెత్తారు. పాటియాలా జిల్లాలోని శంభు, జుల్కాన్, పాసియన్, పాత్రన్, శుత్రానా, సమానా, ఘనౌర్, దేవిగర్, బల్భేరా పోలీస్ స్టేషన్తో పాటు పలు పోలీస్స్టేషన్ల పరిధిలో నెట్సేవల బంద్ కొనసాగనున్నది.