శామీర్పేట, జనవరి 8 : రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని ఉద్దెమర్రి, ఆద్రాస్పల్లి, పొన్నాల్, బాబాగూడ గ్రామాల్లో రైతుబంధు సంబురాల్లో మంత్రి పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు రైతుబంధు సాయం కింద ఇప్పటి వరకు 8 దఫాలుగా మొత్తం రూ.50 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. అనంతరం గ్రామాల్లో చేపట్టిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీలు ఎల్లూబాయిబాబు, హారిక మురళీగౌడ్, జడ్పీటీసీ అనితలాలయ్య, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కృష్ణారెడ్డి, శ్యామల, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శులు సతీశ్రెడ్డి, అనీల్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సుగుణ విష్ణుగౌడ్, శ్రీనివాస్రెడ్డి, హరిమోహన్రెడ్డి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి : మంత్రి
కీసర : తెలుగు రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కరీంగూడ, రాంపల్లిదాయర గ్రామాల్లో సంక్రాంతి సంబురాల్లో భాగంగా సీఎంఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని తెలిపారు. కరోనాకు దూరంగా ఉండి తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు, తృతీయ బహుమతి రూ.2వేల నగదును మహిళలకు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ భద్రారెడ్డి, డాక్టర్ ప్రీతిరెడ్డి, సర్పంచులు ఆండాలు మల్లేశ్, కౌకుట్ల గోపాల్రెడ్డి, ఉప సర్పంచ్ మాధవరెడ్డి, రాము పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం..
ఘట్కేసర్ రూరల్ : రైతుల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని వెంకటాపూర్, పకీర్టెక్యా, ఘనపూర్, మర్పల్లిగూడ, మాదారం గ్రామాల్లో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో మంత్రి , మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి నగదు, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.
మల్లారెడ్డి దవాఖానలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలతో పాటు ఆపరేషన్లు సైతం ఉచితంగా చేయనున్నట్లు మంత్రి ప్రకటించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండల్ రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా సభ్యుడు భిక్షపతి గౌడ్, ఘట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు గీతా శ్రీనివాస్, మంగమ్మ, యాదగిరి, మండల రైతు విభాగం అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, నాయకులు శంకర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.