మేడ్చల్ రూరల్, జనవరి 4 : రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమవ్వడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాయిలాపూర్, పూడూరు గ్రామాల్లోని క్లస్టర్ రైతు వేదికల్లో ఈ యాసంగి వరకు రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ అయిన సందర్భంగా రైతులు సంబురాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశానికి తెలంగాణ ధాన్యాగారంగా మారడానికి ముమ్మాటికి సీఎం కేసీఆర్ ఘనతేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ బలరాంరెడ్డి, సర్పంచ్ నర్మదా గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ అనూపశ్రీకాంత్ రెడ్డి, రైతుబంధు కో ఆర్డినేటర్లు వెంకటేశ్, మహేశ్, డబిల్పూర్, మేడ్చల్ వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు రణదీప్ రెడ్డి, సురేశ్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అర్చన, ఏఈవోలు విజయ్, సుమిత పాల్గొన్నారు.
ఉమ్మడి శామీర్పేట మండలంలో…
శామీర్పేట : ఉమ్మడి శామీర్పేట మండలంలోని మజీద్పూర్, జగ్గంగూడ గ్రామాల్లో జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతులకు రైతుబంధుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, ఎంపీపీలు హారిక మురళీగౌడ్, ఎల్లూబాయిబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, ఏడీఏ వెంకట్రాంరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మోహన్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు బాల్రెడ్డి, వ్యవసాయ అధికారులు రమేశ్, కృష్ణవేణి, ఏఈవో రవి, రైతులు పాల్గొన్నారు.