న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసినా తమకు ఆయనపై విశ్వాసం లేదని బీకేయూ జాతీయ ప్రతినిధి, రైతు నేత రాకేష్ తికాయత్ తేల్చిచెప్పారు. పాల్ఘర్లో ఓ వార్తా చానెల్తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు సాగు చట్టాలను వెనక్కితీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించినప్పటికీ తమ ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు.
ప్రధానిపై తనకు నమ్మకం లేదని, ప్రస్తుతం తాము ప్రభుత్వంతో తదుపరి చర్చలకు వేచిచూస్తున్నామని తికాయత్ పేర్కొన్నారు. కాగా సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని, రైతులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన విపక్షాలు యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసమే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నాయని విమర్శించాయి.