వరంగల్ రూరల్ : రైతుల మేలు కోసమే రైతు వేదికలు. రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
నడికూడ మండలంలోని రాయపర్తి, కంఠాత్మకూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనాలను ఎమ్మెల్యే చల్లా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు.
రైతు వేదకలు అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. సాగులో సమస్యలను రైతులు సమిష్టిగా చర్చించుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.