యాదాద్రి భువనగిరి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన బీబీనగర్ మండలం మదారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాదారం గ్రామానికి చెందిన పగిడాల గోపాల్ రెడ్డి అనే రైతు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
రోజులాగే తన వ్యవసాయ పొలం వద్ద కరెంట్ మోటర్ ఆన్చేసే క్రమంలో ప్రమాదవాశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోపాల్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా మాదారం గ్రామంలో విద్యుదాఘతానికి గురై అకాల మరణం చెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది.