హుజూరాబాద్ : తెలంగాణ రాష్ట్రసమితి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను యువకులు ఇంటింటికీ వెళ్లి వివరించాలని కమలాపూర్ మండల ఇంచార్జ్ డాక్టర్ పెర్యాల రవీంధర్ రావు యువతకు పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా మండలంలోని కన్నూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యూత్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి యువత పట్టుకొమ్మలాంటి వారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించి కారు గుర్తుకు ఓటు వెయ్యాలని ప్రజలను కోరాలని సూచించారు. యువత అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారని, అందుకే యువత పట్టుదల, క్రమశిక్షణతో ముందు నిలిచి టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడాలని కోరారు.
ఈ సమావేశంలో కన్నూరు గ్రామ సర్పంచ్ రామారావు, ఎంపీటీసీ వి భాస్కర్ రావు, సీనియర్ నాయకులు తక్కళ్ళపల్లి సత్యనారాయణ రావు, చెన్నూరు నియోజకవర్గ తోటపల్లి మండల వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రావు, సింగిల్ విండో ఛైర్మన్ సాంబ గౌడ్ , కిమ్స్ విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ పెర్యాల సాకేత్ రామారావు పాల్గొన్నారు