న్యూఢిల్లీ : జింకలు చెంగు చెంగున గెంతుతూ సందడి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.. మరి మూడువేల జింకలు ఒకేసారి గెంతుతూ ఉంటే మరెంతో అద్భుతంగా ఉంటుంది కదూ.. ఒకేసారి మూడువేల జింకలు రోడ్డుదాటుతున్న అద్భుతమైన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్లోని కృష్ణజింకల జాతీయ పార్కులో చిత్రీకరించిన ఈ వీడియోను గుజరాత్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ షేర్ చేసింది. ఆ ట్వీట్ను ప్రధాని నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేశారు. ‘అద్భుతం’ అనే క్యాప్షన్తో ప్రధాని షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 3వేల కృష్ణ జింకలు వరుసగా గెంతుకుంటూ రోడ్డు దాటుతున్న అరుదైన వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మోదీ షేర్ చేసిన అద్భుతమైన వీడియోను చూసిన నెటిజన్లు ఎమోజీలతో చప్పట్ల వర్షం కురిపించారు. వీడియోకు ఇప్పటి వరకు 60వేల మందికిపైగా వీక్షించగా.. 55వేల లైక్స్ రాగా.. 7వేల మందికిపైగా రీ ట్వీట్ చేశారు.