తిరుమలగిరి ఫిబ్రవరి 2: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తిరుమలగిరి మున్సిపాల్టీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేం ద్రంలోని తన నివాసంలో ఆయన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలు, పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల గెలు పు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సంక్షే మం కుంటుపడిందన్నారు.
ప్రజలు బీఆర్ఎస్ పార్టీనే విశ్వసిస్తున్నారని, పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు వివరించి తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేయాలన్నారు. అనంతరం కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 15 వార్డుల అభ్యర్థులకు బీ ఫామ్ అందచేశారు. కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపాలిటీ సమన్వయకర్త బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, పార్టీ మండల అధ్యక్షుడు రఘునందన్రెడ్డి, కల్లెట్లపల్లి ఉప్పలయ్య, మాజీ ఎంపీపీ సతీష్, దూపటి రవీందర్,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.