మహబూబ్నగర్, మార్చి 24 : మీరు అందించిన సహకారంతోనే అప్పన్నపల్లి వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని, మీ త్యాగంతో మరింత అభివృద్ధి జరుగుతున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో అప్పన్నపల్లి వద్ద 2వ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఇండ్లతోపాటు స్థలాలు కోల్పోయిన 95 మందికి రూ.24,69,83,191 నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూములను, ఏండ్ల తరబడి జీవనం సాగించిన ఇండ్లను నష్టపోయినా సహకరించిన ప్రతి ఒక్కరికీ అండ గా ఉంటామన్నారు. వీరికి రోడ్డు పక్కన ప్రభుత్వ భూమి ఉంటే లేఅవుట్ చేసి స్థలాలు ఇ చ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గొర్రెల పెంపకందార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, వక్ఫ్ కమిటీ సభ్యులు అన్వర్పాషా, తాసిల్దార్ పార్థసారథి, రాజగోపాల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.