వీణవంక : మండలంలో గత కొద్ది రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 7 గంటలతో ముగి సింది. చివరి రోజు అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగింది. గ్రామాలలో ఎక్కడా చూసినా గులాబీ జెండాలు, కండువాలు, కరపత్రాలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తాయి.
చిన్నా..పెద్దా..కులం..మతం..ఆడ..మగ అనే తేడా లేకండా ప్రతీ ఒక్కరు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతు తెలుపుతూ రోడ్లపైకి వచ్చి జై తెలంగాణ..జైజై తెలంగాణ..జై కేసీఆర్..జై గెల్లు శ్రీనివాస్ యాదవ్ అంటూ నినాదాలు చేశారు.
మండల కేంద్రంలో దళితుల ఆధ్వర్యంలో 600 మంది డప్పుచప్పుల్లతో టీఆర్ఎస్ జెండా పట్టుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ వీధుల గుండా తిరుగతూ కారు గుర్తుకు మన ఓటు అంటే ప్రచారం చేసి, బస్టాండ్ ఆవరణలో టీఆర్ఎస్ కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆయా గ్రామాలలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, వైస్ఎంపీపీ రాయిశెట్టి లత, మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్ ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.