ఈటల రాజేందర్కు గెలుపు గర్వం తలకెక్కింది. అందుకే విర్రవీగుతూ మాట్లాడుతున్నారు. అతిగా ఊహించుకొని మాట్లాడొద్దు. నువ్వు బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోయేవారు ఎవరూ లేరు.
–కొప్పుల
మాట్లాడుతున్నారని టీఆర్ఎస్వీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్ విమర్శించారు. శుక్రవారం సిద్దిపేటలోని మంత్రి హరీశ్రావు నివాసంలో టీఆర్ఎస్వీ నేతలు భిక్షపతి నాయక్, శ్రీకాంత్రెడ్డి, రమేశ్, సతీశ్, బండి శ్రీకాంత్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మంత్రి హరీశ్రావు కమిట్మెంట్ ఏమిటో సిద్దిపేట ప్రజలకు తెలుసు. నీతో చెప్పించుకొనే అవసరం మా నేతకు లేదు.
అభివృద్ధి, సంక్షేమం ఆయనకు రెండు కండ్లు. ఈటలా.. జాగ్రత్తగా మాట్లాడు’ అని మహేశ్
హెచ్చరించారు. సీఎం కేసీఆర్ను, మంత్రి హరీశ్ను విమర్శించే స్థాయి ఈటలకు లేదన్నారు. ఈటల మాటతీరు సిద్దిపేట ప్రజల చైతన్యాన్ని ప్రశ్నించినట్టుగా ఉన్నదని విమర్శించారు.