హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట! ఇప్పుడు ఈటల కూడా వంద అబద్ధాలు ఆడుతూ ఏదోవిధంగా గట్టెక్కాలని చూస్తున్నాడు. అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం ఆయనకేకాదు.. ఆయన పార్టీ బీజేపీ నేతలకు అలవాటైపోయింది. అందరికంటే రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా వెలగబెట్టిన ఈ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన్నాటినుంచీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం.. ఉప ఎన్నికలో ఏదోవిధంగా గెలవడం కోసం నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ఈయనగారి అబద్ధాలను చూసి ప్రజలు నవ్వుకొంటున్నా.. జంకూ గొంకూ లేక బొంకుతూనే ఉన్నాడు. ఈటల అబద్ధాలను చూసి గోబెల్స్ కూడా సిగ్గుపడుతున్నాడని హుజూరాబాద్ ప్రజలే అనుకొంటున్నారు. ఈటల అబద్ధాల్లో మచ్చుకు కొన్ని..
వాస్తవం: ఈటలే కబ్జా చేశాడని బాధితులు చెప్తున్నారు. అసైన్డ్ భూములను డబ్బు పెట్టి కొనడం కూడా చట్ట విరుద్ధమే. కానీ, అడ్డికి పావుశేరు ధరకు దళితుల భూమికి రేటు కట్టి, పైగా వాళ్లను తనే ఆదుకొన్నానని అంటున్నాడు.
ప్రజల మాట: దళితులంటే ఆయనకు చులకన భావం. ఏనాడూ వారికి ఏ విధమైన సాయం చేయలేదు.
బీజేపీలో చేరిన తరువాత
ప్రజల మాట: తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికే
బీజేపీలోఈటల చేరాడు.
బుకాయింపు: గెల్లును అవమానించడంపై యాదవ సామాజిక వర్గం మండిపడి ఆందోళన చేయడంతో మాట మార్చాడు. తాను గెల్లును బానిస బిడ్డ అననేలేదని బుకాయించాడు.
బుకాయింపు: దీనిపై దళిత లోకం ఆగ్రహించడంతో మాట మార్చాడు. మొదట దళితుల కాళ్లకు పాలతో అభిషేకం చేశాకనే, తాను చేయించుకొన్నానని బుకాయింపు.
ప్రజల మాట: దళితులంటే ఆయనకు చిన్నచూపు. అధికారంలో ఉండగా దళితులను దూరంగా ఉంచాడు.
బీజేపీలో చేరక ముందు
ఆ తరువాత:
వాస్తవం: దళితుల అభ్యున్నతికి కేసీఆర్ 1996లోనే సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్లో చర్చించారు. అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని ఆనాడే కేసీఆర్ నిర్ణయించారు.
వాస్తవం: ఎన్నికల సంఘానికి దాఖలైన ఫిర్యాదులు వెంటనే ఈటలకు చెందిన సోషల్ మీడియాలో వైరల్. ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుల మేరకు దళితబంధును ఆపివేయాలని ఈసీ ఆదేశం.
ప్రజల మాట: దళితులు బాగుపడటం ఈటలకు నచ్చదు. అందుకే దళిత బంధును అడ్డుకొన్నాడు.
వాస్తవం: కారు యజమాని విశ్వనాథ్ వినోద్.. బీజేపీ నేత బండి సంజయ్కు సన్నిహితుడు.
శంకర నందన గార్డెన్స్లో నా సభకు కరెంట్ కట్ చేయించి, మంత్రి హరీశ్అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
వాస్తవం: ఆరు నెలలుగా బిల్లు కట్టకపోవడంతో మూడు నెలల కిందటే కరెంటు కనెక్షన్ కట్ అయింది. జనరేటర్లో డీజిల్ లేక కరెంట్ కైట్టెంది.
ప్రజల మాట: జనరేటర్లో డీజిల్ ఉందా లేదా చూసుకోనోడు రేపు హుజూరాబాద్ ప్రజల బాగోగులు ఏం చూస్తడు.
వాస్తవం: గ్యాస్ సిలిండర్పై జీఎస్టీ పేరిట కేంద్రం వసూలు చేసే 5 శాతం పన్ను అంటే దాదాపు రూ. 44లో సగం అంటే రూ.22 రాష్ర్టానికి ఇస్తుంది.
వాస్తవం: పట్టాదారు పాస్ పుస్తకంలో ఈటల కొడుకు పేరు నితిన్రెడ్డి, తండ్రి పేరు రాజేందర్రెడ్డి అని ఉన్నది. 2019 నుంచి అలాగే ఉన్నా మార్చుకోలేదు. కొడుకు, బిడ్డకు రెడ్డి కులస్తులతో పెండ్లిళ్లు జరిపించిన ఆయనలో బీసీ హృదయం ఉన్నదా?
ప్రజల మాట: తన కులస్తులైన ముదిరాజ్లను ఇబ్బందులు పెట్టేవాడు.
వాస్తవం: ఆగస్టు 19న మాట్లాడుతూ- లెఫ్టు, రైటు అనేవి ఉండవని, డైనమిక్గా ఉండాలని ఈటల నిస్సిగ్గుగా చెప్పుకొన్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నందు వల్ల అందులో చేరుతున్నానన్నాడు.
ప్రజల మాట: అధికారంలోకి బీజేపీ వస్తుందనే నమ్మకంతో అందులో చేరిన ఈటల, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరతాడన్నమాట.
వాస్తవం: అసైన్డ్ భూములు కొన్నానని గతంలో ఆయనే అంగీకరించాడు. ఆ వ్యవహారం అంతా బయటపడటంతో ముఖం చెల్లక రాజీనామా చేశాడు.
వాస్తవం: ఈటల పంపిణీ చేసిన గోడ గడియారాలు, బొట్టు బిళ్లలు, దసరా రోజు క్వార్టర్ బాటిళ్లను ప్రజలు నేలకు కొట్టడంతో అసలు బండారం బ యటపడ్డది. కొందరికి కుట్టుమిషన్లు ఇచ్చాడని చెప్పుకొంటున్నరు.
ప్రజల మాట: చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేని మనిషి ఈటల.
వాస్తవం: బతుకమ్మ పాట వీడియోకు ఆడియోను మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టు తేలింది.
అబద్ధం 15: టీఆర్ఎస్ను మంత్రి హరీశ్రావు తిట్టినట్టు ఫేక్ వీడియోను ఈటల ప్రచారం చేయించాడు.
వాస్తవం: అసలు వీడియో రావటంతో ఈటల బండారం బయటపడ్డది.
అబద్ధం 16: హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో మంత్రి కేటీఆర్ కామెంట్ చేసినట్టు ఫేక్ వీడియో సృష్టించాడు.
వాస్తవం: ఫేక్ వీడియో బండారం వెల్లడితో ఈటల పరువుపోయింది.
అబద్ధం 17: తాను డిగ్రీ చేసినా నిరుద్యోగినంటూ, బర్లు కాసుకుంటే బెటరంటూ ఉద్యోగాలపై వ్యాఖ్యలు చేసిన ఓ యువతి వీడియోను తమ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
వాస్తవం: అసలు ఆ యువతి డిగ్రీ చదువుకోలేదని, సరదాగా టిక్టాక్ కోసం వీడియో చేసినట్టు తెలిసింది.