హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై తెలంగాణ అసెంబ్లీలో సస్పెన్షన్ విధించారు. సమావేశాలు ముగిసే వరకు ఆయనపై సస్పెన్షన్ విధించారు. అసెంబ్లీ సబ్ రూల్ 2, రూల్ 340 కింద బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను సస్పెండ్ చేస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. సమావేశాలు ముగిసే వరకు రాజేందర్ను సస్పెండ్ చేశారు. సారీ చెప్పేందుకు ఈటల నిరాకరించారని, అందుకే ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి వేముల తెలిపారు. స్పీకర్ పోచారంను మరమనిషి అని రాజేందర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని మంత్రి అన్నారు.