హుజూరాబాద్ : ఈటల రాజేందర్ అబద్దాల పుట్ట అని, ఆయనకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఈటల రాజేందర్ బతుకు అధోగతి కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.