సిడ్నీ: రెండేండ్ల తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (260 బంతుల్లో 137; 13 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మంచి స్కోరు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు సగం ఆటే సాధ్యం కాగా.. ఓవర్నైట్ స్కోరు 126/3తో గురువారం మ్యాచ్ కొనసాగించిన ఆసీస్ 416/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. స్మిత్ (67) హాఫ్సెంచరీ నమోదు చేశాడు. బ్రాడ్కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది.