రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ (Kanker) జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాంకేర్ జిల్లాలోని హిదూర్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో వారికి తారసపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్కౌంటర్లో (Encounter) కానిస్టేబుల్ రమేశ్, ఓ మహిళా మావోయిస్టు చనిపోయారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.