అమరావతి : ఏపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి ఉద్యమాల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు సాధన సమితి నాయకులు విజయవాడలోని ఎన్జీవో హోంలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు ఇవాళ సీఎస్ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నారు. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వాలని ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, ఏపీ అమరావతి ఉద్యోగ సంఘం నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
23 న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్టేబుల్ సమావేశాలు, 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు ధర్నాలు, 26న అన్ని తాలుకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతుల అందజేత, 27 నుంచి 30 వరకు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నాయి. 3న ఛలో విజయవాడ , 5నుంచి సహాయ నిరాకరణ ,7నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు.