మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్లోని గౌరీశంకర్ కాలనీలో మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్యాణలక్ష్మి లబ్ధిదారురాలు శైలజ ఇంట్లో భోజనం చేశారు. ప్రభుత్వ ఆర్థికసాయం వారికి ఏ విధంగా సాయపడిందో వాకబు చేశారు. కుమార్తె వివాహం చేయడానికి కష్టపడుతున్న తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడిందని కవిత పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
– ఖైరతాబాద్