తైపీ : చైనా తయారుచేసిన కొవిడ్-19 టీకాపై ప్రజలకు ఇంకా పూర్తిగా నమ్మకం కలుగడం లేదు. ఇటీవల ప్రచురించిన ఒక సర్వేలో తైవాన్లో 67 శాతం మంది ప్రజలు చైనాలో తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ను తీసుకోవడానికి నిరాకరించారని తెలిపింది. ఇది చైనాకు ఇబ్బందికరంగా తయారైనట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
తైపీకి చెందిన హోవార్డ్ ప్లాజా హోటల్లో ఫోకస్ సర్వే రీసెర్చ్ ఈ నివేదికను సమర్పించినట్లు తైవాన్ టైమ్స్ తెలిపింది. టీకాను ఆమోదించని వారిలో 67 శాతం మందిలో 27.1 శాతం మంది తాము ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నామని, 39.9 శాతం మంది తాము చాలా అసంతృప్తిగా ఉన్నామని తెలిపినట్లు నివేదిక పేర్కొన్నది.
చైనా తన వ్యాక్సిన్ల గురించి శాస్త్రీయ డాటాను విడుదల చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమని స్ట్రాటజిక్ స్టడీ సొసైటీకి నాయకత్వం వహిస్తున్న తమంగ్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ వాంగ్ కున్-యి అభిప్రాయపడ్డారు. చైనా నుంచి తైవాన్ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవాలనుకుంటే దీనికి 18.9 శాతం మందికి మాత్రమే అనుమతి ఉన్నదని ఆయన చెప్పారు.
తైవాన్ ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ స్టడీ సొసైటీ, తైవాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేషన్ రూపొందించిన ఈ సర్వే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో తైవాన్-చైనా సంబంధాలు, తైవాన్-యుఎస్ సంబంధాల గురించి ప్రజలను ప్రశ్నలు అడిగారు.
బెంగాల్, అసోం ఎన్నికల బరిలో జేడీయూ
109 ఏండ్ల రాష్ట్రంగా బిహార్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.