109 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి వైదొలిగి కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలోని 12 వ రాష్ట్రం. 1912 లో ఏర్పడిన ఈ రాష్ట్రం పేరు బిహార్. ఇవాళ బిహార్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలలో ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ ఉంది. దీని ప్రారంభం బిహార్ నుంచి వచ్చినదని కూడా చాలా మంది చరిత్రకారులు నమ్ముతారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలకు చదవడం, వ్రాయడం కూడా తెలియని సమయంలో నలంద విశ్వవిద్యాలయం అతిపెద్ద విద్యా కేంద్రంగా ఉన్నది.
క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో బిహార్ పాలకులను ప్రజల ప్రతినిధులు ఎన్నుకున్నారు. 1935 లో బిహార్ నుంచి వేరు చేయబడిన ఒరిస్సా అనే కొత్త రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది. దీనిని ఇప్పుడు ఒడిశా అంటున్నాం. బిహార్ మళ్లీ 2000 లో విభజించబడి.. జార్ఖండ్ రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది. నేపాల్ సరిహద్దుగా ఉన్న ఈ రాష్ట్రంలో కేవలం 11.3 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం బిహార్లో దాదాపు 58 శాతం మంది 25 ఏండ్ల కన్నా చిన్నవారు ఉన్నారు.
పారిస్లో మొదటిసారిగా 1895 మార్చి 22 న సినిమాను బహిరంగంగా ప్రదర్శించారు. కార్మికులు ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్న వీడియోను లూయిస్ లూమియర్ సోదరులు రికార్డ్ చేసి స్క్రీనింగ్లో చూపించారు. ఈ పద్ధతిని లూమియర్ బ్రదర్స్ దాని స్వంత పేరుతో పేటెంట్ పొందారు. ఈ చిత్రం కేవలం 45 సెకన్ల నిడివి ఉన్నది. ఇది సుమారు 200 మంది సందర్శకులను ఆకర్షించింది. ఈ చిత్రం 1896-97లో భారతదేశంలో కూడా ప్రదర్శించబడింది.
లూమియర్ బ్రదర్స్, వారి బృందం మొదటి చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వారి చిత్రాలను ప్రదర్శించారు. ప్రస్తుతం 70 ఎంఎం స్క్రీన్పై ప్రదర్శస్తిండగా.. లూమియర్ బ్రదర్స్ తమ మొదటి చిత్రాన్ని 35ఎంఎంలో చిత్రీకరించారు.
2005: ప్రసిద్ధ నటుడు జెమిని గణేషన్ కన్నుమూత
2004: హమాస్ సహ వ్యవస్థాపకుడు, పాలస్తీనా ఇస్లామిక్ నాయకుడు షేక్ అహ్మద్ యాసిన్ ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో మరణం
1993: నీటి వనరులను కాపాడటానికి ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించిన ఐక్యరాజ్యసమితి
1977: ప్రధాని పదవికి ఇందిరా గాంధీ రాజీనామా సమర్పణ
1960: రేడియేషన్ యొక్క ఆవిరి ఉద్గారం లేజర్ అప్లికేషన్ కోసం పేటెంట్ పొందిన ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు
1956: జాత్యహంకార చట్టాన్ని వ్యతిరేకించినందుకు అమెరికాలో జైలుపాలైన మార్టిన్ లూథర్ కింగ్
1947: చివరి వైస్రాయ్ గా భారతదేశానికి వచ్చిన లార్డ్ మౌంట్ బాటన్
1945: అరబ్ లీగ్ను ఏర్పాటుచేసిన మధ్యప్రాచ్య ఆసియా దేశాలైన ఈజిప్ట్, సిరియా, లెబనాన్, ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా, యెమెన్
1934: జార్జియాలోని అగస్టాలో మొదటి గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహణ
1894: చిట్టగాంగ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన విప్లవకారుడు సూర్య సేన్ జననం
1890: పారాచూట్ నుంచి దిగిన మొదటి భారతీయ వ్యక్తిగా నిలిచిన రామచంద్ర ఛటర్జీ
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.