విద్యుత్తు బైకులు కాలిపోతున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూర్లో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మంటలు వచ్చాయి. సతీష్కుమార్ అనే వ్యక్తి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్పై వెళ్తుండగా అకస్మాత్తుగా సీటు కింద నుంచి మంటలు రావడం గమనించాడు.
ఈ హఠాత్పరిణామం నుంచి వెంటనే తేరుకున్న అతను బండిని అక్కడే నిలిపేసి దూరంగా వెళ్లిపోయాడు. వాహనానికి అంటుకున్న మంటలను స్థానికులు నీటి సాయంతో ఆపేశారు. అప్పటికే బైక్ చాలా వరకు కాలిపోయింది.