ఈటానగర్ : అరుణాచల్ప్రదేశ్లోని చాంగ్లాంగ్లో ఆదివారం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం చాంగ్లాంగ్కు వాయువ్యంగా 70 కిలోమీటర్ల దూరంలో తేజు, లోహిత్ సమీపంలో భూమికి 48 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు పేర్కొంది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.3గా నమోదైనట్లు సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.