ఖాట్మండు : నేపాల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.3గా నమోదైందని భారత భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఖాట్మండు తూర్పు ఈశాన్య దిశలో 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉన్నట్లు పేర్కొంది. ఉదయం 5 గంటల 4 నిమిషాల ప్రాంతంలో భూఉపరితలాన 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. భూప్రకంపన కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఖాట్మండు పరిసరాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.