తుంగతుర్తి, ఫిబ్రవరి 12 : బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) చేసుకోవాలని ఆర్బీఐ లీడ్ మేనేజర్ కోమిద, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగవరప్రసాద్ సూచించారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ-కేవైసీ చేసుకోని పక్షంలో బ్యాంక్ ఖాతాలు నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. ఖాతాదారులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ క్రాంతికుమార్, పలు బ్యాంకుల సిబ్బంది పాల్గొన్నారు.