హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో నిషేధిత ఈ-సిగర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఈ-సిగరెట్ల ఖరీదు సుమారు 15 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గుర్నిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య సమాచారం ఆధారంగా పంజాగుట్టలో ఓ వ్యక్తిని తొలుత అరెస్టు చేశాడు. అతను జీడిమెట్లకు చెందినట్లు గుర్తించారు. ఈ-సిగరెట్లను కొందరికి ఇవ్వడానికి వచ్చిన సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఈ-సిగరెట్లను స్టాక్ చేసి వాటిని ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు.