న్యూస్నెట్వర్క్, నమస్తేతెలంగాణ: అకాల వర్షం రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్, కథలాపూర్, కోరు ట్ల, మెట్పల్లి రూరల్, ఇబ్రహీంపట్నం, మల్లా పూర్, రాయికల్, ధర్మపురి, పెగడపల్లి, మల్యా ల, రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, వేములవాడ మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు ఉరుములు, మెరుపులతో కూడిన వానపడడంతో అపార నష్టం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. కోతకొచ్చిన వరి చేలు నేలకొరిగాయి. చేతికొచ్చిన మామిడికాయలు కింద రాలాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో సుమా రు 731 హెక్టార్లలో మామిడి పంటకు నష్టం కలిగిందని అధికారులు తెలిపారు. పలుచోట్ల స్తం భాలు విరిగిపడడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో బడుగు మోజేశ్కు చెందిన పూరి గుడిసె కుప్పకూలింది. అదే గ్రామానికి చెందిన సోమినేని శంకరయ్యకు చెందిన ఎద్దు పిడుగుపాటుకు మరణించింది.
ఎద్దంతా దుఃఖం
కోనరావుపేట, మే 16: కుటుంబసభ్యుడిలా సాదుకుంటున్న ఎద్దు మరణంతో రైతు కుటుంబం గొల్లుమన్నది.. కట్టేసిన చోటే ప్రాణమిడిచిన మూగజీవిని చూసి బోరునవిలపించింది..‘ఆయ్యో బిడ్డా ఎంతపనాయే’ అంటూ కళేబరంపై పడి కన్నీరుమున్నీరైంది. వివరాలు..కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన సోమినేని శంకరయ్య రోజుమాదిరిగానే ఆదివారం రాత్రి తన ఇంటి వెనుకాల ఉన్న తుమ్మచెట్టు కింద కాడేడ్లను కట్టేశాడు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు తుమ్మచెట్టుపై పిడుగుపడ్డది. చెట్టుకింద ఉన్న ఎద్దు అక్కడికక్కడే మరణించింది. తెల్లారి లేచిచూసేసరికి విగతజీవిగా పడిఉండడంతో సదరు రైతు దుఃఖం కట్టలు తెంచుకున్నది. కళేబరంపై పడి రోదించిన తీరు గ్రామస్తులను కలిచివేసింది. రూ. 65వేల నష్టం వాటిల్లిందని చెప్పాడు. కాగా బాధిత కుటుంబాన్ని సర్పంచ్ కొక్కుల భారతి, ఎంపీటీసీ మిర్యాల ప్రభాకర్రావు, ఉప సర్పంచ్ రాంరెడ్డి పరామర్శించారు.