దుండిగల్,డిసెంబర్ 26 : కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని శ్రమశక్తి అవార్డు గ్రహీత, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకుడు ముద్దాపురం మదన్గౌడ్ అన్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఏఆర్ లైఫ్సైన్సెస్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు మొదటి వేతన ఒప్పందం కింద రూ.6వేల7 వందలు, రెండో వేతన ఒప్పందం కింద రూ.9వేలను అదనంగా చెల్లించేలా పరిశ్రమ యాజమాన్యంతో పలు దఫాలుగా చర్చించి ఒప్పించారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్(ఒప్పందాన్ని)ను జిల్లా లేబర్కమిషనర్ ప్రమోద్రెడ్డి సమక్షంలో చేయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కార్మికులు,యాజమాన్యం పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మదన్గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాశ్, రాంబాబు, కిరణ్, బాబు, షేక్ అక్బర్, నాగేంద్రబాబు, పులినాయుడు పాల్గొన్నారు.