న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి అయ్యింది. అయితే తొలి రౌండ్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము లీడింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ పార్లమెంట్ హాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల బ్యాలెట్లను తెరవనున్నారు. తొలి రౌండ్లో పోలైన 748 ఓట్లలో ముర్ముకు 540 ఓట్లు దక్కాయి. ఇక యశ్వంత్కు 204 ఓట్లు పడ్డాయి. ఇవాళ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయ్యింది. ముర్ముకు పోలైన 540 ఓట్ల విలువ సుమారు 3,78,000 ఉంటుంది. ఇక యశ్వంత్కు పోలైన 208 ఓట్ల లెక్క విలువ 1,45,600 ఉంటుంది. ఇవన్నీ పార్లమెంట్ ఓట్లు మాత్రమే.
Droupadi Murmu has secured 540 votes with a value of 3,78,000 & Yashwant Sinha has secured 208 votes with a value of 1,45,600. A total of 15 votes were invalid. These are figures for Parliament (votes), please wait for next announcement: PC Mody, Secretary General, Rajya Sabha pic.twitter.com/ka0PvmOzpX
— ANI (@ANI) July 21, 2022