శంషాబాద్ రూరల్, మార్చి 31 : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 8.9 కోట్ల విలువైన గంజాయిని డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా.. ప్యాకెట్లలో దాచుకొని తీసుకువస్తున్న 25.45 కిలోల హైడ్రోపోలిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ కేంద్ర కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.