చాండీపూర్: స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ(ఎస్ఎఫ్డీఆర్) మిస్సైల్ను ఇవాళ డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణి వ్యవస్థను పరీక్షించారు. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు ఈ పరీక్ష జరిగింది. మిస్సైల్ వ్యవస్థలోని అన్ని సిస్టమ్స్ను టెస్ట్ చేశారు. గ్రౌండ్ బూస్టర్, నాజిల్ లెస్ మోటార్ అద్భుతంగా పనిచేశాయి. గ్రౌండ్ బూస్టర్ సపరేషన్ అనుకున్నట్లుగానే సాగింది. ఎస్ఎఫ్డీఆర్ టెక్నాలజీతో సుదీర్ఘ దూరం ప్రయాణించే మిస్సైళ్లను తయారు చేయడానికి డీఆర్డీవోకు మార్గం సులువుకానున్నది. ఇలాంటి టెక్నాలజీ చాలా కొన్ని దేశాల వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. రామ్జెట్ ఆపరేషన్కు కావాల్సిన రీతిలో గ్రౌండ్ బూస్టర్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రో ఆప్టికల్, రేడార్, టెలిమిట్రీ పరికరాలతో మిస్సైల్ డేటాను సేకరించారు. వివిధ డీఆర్డీవో ల్యాబుల్లో ఉన్న శాస్త్రవేత్తలు ఈ పరీక్షను మానిటర్ చేశారు. డీఆర్డీఎల్, ఆర్సీఐ, హెచ్ఈఎంఆర్ఎల్ ల్యాబ్లు టెస్ట్ను పర్యవేక్షించాయి. ఎస్ఎఫ్డీఆర్ పరీక్ష సక్సెస్ అవడం పట్ల శాస్త్రవేత్తలకు డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి కంగ్రాట్స్ తెలిపారు.