సికింద్రాబాద్, డిసెంబర్ 1: పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు రసూల్పురా సిల్వర్ కంపౌండ్లో అదనంగా నిర్మించనున్న మరో 56 ఇండ్లకు బుధవారం కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి పేదకు రెండు పడకల గదుల ఇండ్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు.
శంకుస్థాపన చేసిన ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని, మిగిలి పోయిన పేదవారికి కూడా మరిన్ని ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. కరోనా క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు సదా కేశవరెడ్డి, పాండుయాదవ్, లోక్నాథం, నళినికిరణ్, ప్రభాకర్, టీఆర్ఎస్ నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, దేవులపల్లి శ్రీనివాస్, అశోక్గౌడ్, మణికంఠ, శర్విన్, మురళీయాదవ్ తదితరులు పాల్గొన్నారు.