సిద్దిపేట అర్బన్, ఆగస్టు 26 : సిద్దిపేట రూరల్ మండలం చింతమడక, మాచాపూర్, సీతరాంపల్లి గ్రామాల్లో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు.
నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను లబ్దిదారులకు అందించేందుకు కావాల్సిన తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ఆర్డీఓ అనంతరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.