ధ్యాయే నృసింహం.. తరుణార్క నేత్రం.. సితాంబుజాతం జ్వలితాగ్ని వక్రం అనాది మధ్యాంతమజం పురాణం.. పరాత్పరేశం జగతాం నిధానం.. అని ధ్యానించి.. అనంతరం
ఓం శ్రీలక్ష్మీనృసింహాయ నమః సువర్ణ దక్షిణాం సమర్పయామి అని త్రికరణ శుద్ధిగా మా శక్తిమేరకు ముడుపులు చెల్లిస్తున్నాను స్వామి’ అని అనుకొని భక్తిభావనతో తాము చెల్లించదలచిన సొమ్మును లేదా చెక్కును స్వీకర్తలకు నేరుగా కానీ, ఆలయ ఖాతాలో కానీ జమచేయవచ్చు
అంబర్పేట, అక్టోబర్ 22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపు ర స్వర్ణతాపడం కోసం తన ఉంగరాన్ని సమర్పించేందుకు ఐదేండ్ల చిన్నారి సంవిత్ వీర్ ముందుకొచ్చాడు. హైదరాబాద్లోని బాగ్ అం బర్పేటకు చెందిన సునీల్వీర్, శ్వేత దంపతుల కుమారుడు సంవిత్ వీర్కు నరసింహస్వామి అంటే చాలా ఇష్టం. మీడియా ప్రతినిధిగా ఉన్న బాలుడి తండ్రి ఇటీవల సీఎం యాదాద్రి పర్యటన కవరేజీకి వెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చిన తర్వా త తన కుమారుడికి ఆనాటి విశేషాలు వివరించాడు. అది విన్న చిన్నారి తన ఉంగరాన్ని స్వా మికి ఇస్తానని, ఈ విషయం కేసీఆర్ తాతకు చెప్తానంటూ వీడియోను న్యూస్గ్రూప్లో పోస్ట్ చేశాడు. కేసీఆర్ను స్వయంగా కలిసి ఉంగరం అందజేయాలన్నది ఆ బాలుడి కోరిక.
యాదాద్రి, అక్టోబర్ 22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడం నిమిత్తం భక్తులు కానుకలు సమర్పించేందుకు బాలాలయంలో అధికారులు శుక్రవారం ప్రత్యేక హుండీ ఏర్పాటు చేశారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేశామని ఈవో ఎన్ గీత తెలిపారు. కానుకలను నేరుగా ఈ హుండీలోనే వేయాలని కోరారు. తొలి రోజు హైదరాబాద్లోని అత్తాపూర్కు చెందిన కల్యాణ్ చక్రవర్తి దంపతులు తమవంతుగా రెండు గ్రాముల బంగారాన్ని ఈ హుండీలో వేశారు.
మేడ్చల్ రూరల్, అక్టోబర్ 22: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం స్వర్ణ తాపడానికి గుండ్లపోచంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. కౌన్సిలర్లు ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున, వైస్ చైర్మన్ ప్రభాకర్ రూ.లక్ష చొప్పున విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి శుక్రవారం ఆయన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నారసింహుడికి విరాళాలు జమచేయాల్సిన ఖాతా వివరాలు
ఖాతా నంబర్ 6814884695
ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐడీఐబీ000వై011,
ఇండియన్బ్యాంకు యాదగిరిగుట్ట బ్రాంచ్