న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, కమోడిటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 114.49 పాయింట్లు అందుకొని 73,852.94 పాయింట్లకు చేరుకున్నది.
ఇంట్రాడేలో 74 వేల పాయింట్లకు పైగా చేరుకున్న విషయం తెలిసిందే. మరో సూచీ నిఫ్టీ 34.40 పాయింట్లు అందుకొని 22,402.40 వద్ద నిలిచింది. దీం తో మదుపరుల సంపద రూ.8 లక్షల కోట్లకు పైగా పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.8,48,328.9 కోట్లు పెరిగి రూ. 4,01,37,377.21 కోట్లకు చేరుకున్నది. రంగాలవారీగా చూస్తే మెటల్, కమోడిటీస్, ఇండస్ట్రీయల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు లాభాల్లో ముగియగా.. ఐటీ, టెలికం, టెక్నాలజీ రంగ షేర్లు నష్టపోయాయి.